విజయవాడ : ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామలో సోమవారం నుంచి మేఘా గ్యాస్ సేవలు ఆరంభమయ్యాయి. పట్టణంలోని జాతీయ రహదారి వద్దగల భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కు చెందిన శ్రీ బాలాజీ భారత్ ఫిల్లింగ్ స్టేషన్లో మేఘా గ్యాస్ సీఎన్జీ విక్రయాలను మేఘా గ్యాస్ టెక్నికల్ ఇంచార్జి రాజ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ.. మేఘా గ్యాస్ సేవలను విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు.
త్వరలో కృష్ణ జిల్లాలోని గుణదల, గుడివాడ, జగ్గయ్యపేటతో పాటు మరికొన్ని కేంద్రాల్లో మేఘా గ్యాస్ సీఎన్జీ విక్రయాలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో ఇప్పటికే కానూరు, విజయవాడ పండిట్ నెహ్రు బస్సు స్టేషన్, జగ్గయ్యపేట, గుడివాడ, విద్యాధరపురం తదితర ప్రాంతాల్లో తాము గ్యాస్ విక్రయాలు చేస్తున్నామని తెలిపారు.
తక్కువ ఖర్చుతో వాహన దారులు ఎక్కువ దూరం ప్రయాణించేందుకు సీఎన్జీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇట్స్ స్మార్ట్ ఇట్స్ గుడ్ ట్యాగ్ లైన్ తో తాము సీఎన్జీ వినియోగదారులకు కార్డులు జారీ చేస్తున్నామని, వాటిని వినియోగించే రాయితీతో సీఎన్జీ గ్యాస్ కొనుగోలు చేయొచ్చు అని చెప్పారు.
కార్యక్రమంలో మేఘా గ్యాస్ ప్రతినిధులు శర్మ, రామకృష్ణ, ఫిల్లింగ్ స్టేషన్ యజమాని రోహిత్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
ఇల్లందకుంటలో దళితుల భారీ ర్యాలీ