అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు రాష్ట్రవ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిర్వహించనుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. 45 ఏండ్లు దాటిన వారికి, ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులతోపాటు విదేశాలకు వెళ్లే వారికి ఈ డ్రైవ్లో టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఒక్కరోజే 8 నుంచి 10 లక్షల మందికి టీకాలు వేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే లక్ష డోసులు వేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తెలిపారు.