శ్రీశైలంలో బయటపడిన ధ్యానమందిరం

శ్రీశైలం : శ్రీశైల ఆలయ పరివార దేవాలయాలైన పంచమఠాల జీర్ణోద్ధరణ పనుల్లో పురాత ధ్యానమందిరం బయటపడింది. ఘంటామఠం ఆవరణలో ఈ మందిరం కనిపించింది. గురువారం సాయంత్రం ఘంటామఠం ముందు భాగంలోని కొనేరుకు ఉత్తర భాగాన సుమారు 6 అడుగుల 6అంగుళాల విస్తీర్ణంతో ధ్యానమందిరం కనిపించింది. ఈ విషయాన్నిఆలయ కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు.
ధ్యాన మందిరంలో నైరుతి నుంచి ఆగ్నేయం వరకు, ఆగ్నేయం నుంచి తూర్పు మార్గం వైపునకు సొరంగాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నాటి నిర్మాణాలకు విఘాతం కలుగకుండా జీర్ణోద్ధరణ పనులు చేపడుతున్నారు. రోజురోజుకు బయట పడుతున్న పురాతన కట్టడాలపై పురావస్తుశాఖ అధికారులు కూడా శోధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ధ్యానమందిరాన్ని పరిశీలించిన వారిలో ఈఈ మురళీ బాలకృష్ణ, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ శ్రీహరి, సహయ స్థపతి జవహర్, ఏఈ సురేశ్ కుమార్రెడ్డి ఉన్నారు. ఈ జీర్ణోద్దరణ పనుల్లోనే ఇటీవలనే వెండి నాణేలు కూడా బయటపడ్డాయి.
తాజావార్తలు
- ఇంత తక్కువలో అంత సుందర రథం నిర్మించడం అభినందనీయం
- పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించిన తేరా చిన్నపరెడ్డి
- ఏసీబీ వలలో విద్యుత్ ఉద్యోగి
- టీజర్కు ముందు ప్రీ టీజర్..ప్రమోషన్స్ కేక
- భద్రతామండలిలో భారత్కు చోటుపై లిండా ఏమందంటే?!
- ట్రాక్టర్ ర్యాలీ హింస: 33 కేసులు.. 44 లుక్ అవుట్ నోటీసులు
- వెంకీ-వరుణ్ 'ఎఫ్ 3' విడుదల తేదీ ఫిక్స్
- 40ఏండ్ల ఇండస్ట్రీకి కూడా ఇది తెలుసు. కానీ,
- శ్యామ్సంగ్ మరో బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎంవో2 ..! 2న లాంచింగ్!!
- ప్రపంచంలోనే అత్యధిక కార్లు విక్రయించిన కంపెనీ ఇదే..!