శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం సిబ్బందికి, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఈఓ కేఎస్ రామారావు వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం క్షేత్ర పరిధిలోని పలు విభాగాలను ఆయన తనిఖీ చేసి మల్లికార్జున సదన్లో డాక్టర్ సోమశేఖర్, ఆలయ భద్రతా పర్యవేక్షకుడు శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో విడుత వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు.
ఆలయ సిబ్బంది ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఓపీ రోగులకు సరిపడా మందులను సమకూర్చుకోవాలని అపోలో వైద్యుడు మహేశ్కు చెప్పారు. అనంతరం గోశాలను సందర్శించి ఆవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, తాటాకులతో చలువ పందిళ్లు వేయాలని అన్నారు. ఈఓ వెంట ఏఈఓలు కృష్ణారెడ్డి, డీ మల్లయ్య, పర్యవేక్షకుడు మధుసూదన్ రెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకుడు అనిల్ కుమార్ ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.