శ్రీశైలం : ఈ కరోనా కాలంలో మాస్కు ఒక్కటే మనకు రక్ష అని శ్రీశ్రీ తత్వ వేదసాత్వ మార్ట్ శ్రీశైలం మేనేజర్ ప్రవీణ్శర్మ అన్నారు. కొవిడ్ బారి నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా అవగాహన కల్పించాలన్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ పిలుపు మేరకు గురువారం శ్రీశైలంలో మాస్క్ లు పంపిణీ చేశారు.
ప్రవీణశర్మ ఆధ్వర్యంలో క్షేత్ర పరిధిలోని సాధువులు, యాచకులు, అనాధ వృద్ధులు, మానసిక వికలాంగులు, తదితరులకు సర్జికల్, కాటన్ మాస్క్ లు, బిస్కెట్స్, వాటర్ బాటిల్ లను అందించారు. స్థానిక సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్ లోగల మార్జ్ వద్దకు వచ్చిన వంద మందికి పైగా సాధువులతో పాటు దేవస్థానం శానిటేషన్ సిబ్బందికి కూడా మాస్కులు అందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దేవస్థానం ఈవో కేఎస్ రామారావు పిలుపునిచ్చారు.