తిరుమల: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) నూతన అధ్యక్షుడు మంచు విష్ణు, సీనియర్ నటుడు మోహన్బాబు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన ప్యానల్ సభ్యులతోపాటు తిరుమల వచ్చిన విష్ణు.. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మా’ ఎన్నికల్లో గెలిచినందుకు స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చామన్నారు. మా సభ్యులు కొందరు రాజీనామా చేసిన విషయం గురించి తమకు తెలియదని చెప్పారు. మీడియా ద్వారానే వింటున్నామని, వారి రాజీనామా లేఖలు తమకు అందలేనది వెల్లడించారు.