అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఆస్తి తగాదాలు ఇద్దరు వ్యక్తుల మరణానికి దారితీశాయి. జిల్లాలోని పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లెలో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పార్థసారథిరెడ్డిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాల్పులకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు తెలిపారు. పులివెందుల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం గమనార్హం.