హైదరాబాద్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఎనిమిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాక్షసులను సంహరించి స్వయంభుగా వెలిసిన మహిషాసుర మర్దినిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అష్ట భుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిందని పురాణాలు చెబుతున్నాయి. శుక్రవారం విజయదశమి పండుగ సందర్భంగా కనకదుర్గమ్మ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.