మహబూబ్నగర్ : మహబూబ్నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో హైదరాబాద్ సీఐడీ విభాగం ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా సుదీర్ఘకాలం పని చేసిన రెమా రాజేశ్వరి హైదరాబాద్కు బదిలీ అయ్యారు. ఆర్ వెంకటేశ్వర్లు గతంలో సూర్యాపేట ఎస్పీగా పని చేశారు.