పాత సోఫాను ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి రూ.1.96లక్షలు పోగొట్టుకున్నాడు. మారేడ్పల్లికి చెందిన సుశీల్ తన సోఫాను విక్రయించేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన పెట్టాడు. ఆ ప్రకటన చూసిన ఓ సైబర్నేరగాడు ఫోన్ చేసి రూ.6500 గూగుల్ పే, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తానని చెప్పాడు. దానికి బాధితుడు ఒప్పుకోవడంతో రూ.6500 క్యూఆర్ కోడ్ పంపించాడు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఎనిమిది దఫాలుగా బాధితుడి ఖాతాలో నుంచి రూ.1.96లక్షలు ఖాళీ అయ్యాయి. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.