హైదరాబాద్ : జమ్మూలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల 13న భూమిపూజ నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు. భూమిపూజ ఏర్పాట్లపై శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆలయం, ముఖ మండపం, ప్రాకారం, పోటు, యాత్రికుల వసతిపై సమావేశంలో అధికారులతో చర్చించారు. రెండు దశల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఈఓ జవహార్ రెడ్డి ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.