బీబీనగర్, మే 29 : విద్యుత్ సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని గూడూరులో ఏర్పడిన వోల్టేజీ సమస్యను స్థానిక నాయకులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన మండలంలోని అనంతారం సబ్స్టేషన్ నుంచి గూడూరు గ్రామానికి నేరుగా విద్యుత్ లైన్ ఏర్పాటు చేయించి శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, జడ్పీటీసి గోళి ప్రణీతాపింగళ్రెడ్డి, ఎంపీపీ యర్కల సుధాకర్గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బొక్క జైపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ గడ్డం బాల్రెడ్డి, ఎంపీటీసి స్వప్న రాజశేఖర్ గౌడ్, పోనుగంటి నర్సిహాచారి, అనంతారం సర్పంచ్ చిందం మల్లికార్జున్, విద్యుత్శాఖ అధికారులు పాల్గొన్నారు.
గణేశ్యాదవ్ కుటుంబానికి ఎమ్మెల్యే పైళ్ల పరామర్శ
మండలంలోని పడమటిసోమారం సర్పంచ్ తలబోయిన గణేశ్యాదవ్ సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. శనివారం స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి గణేశ్యాదవ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట టీఆర్ఎస్ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గోళి పింగళ్రెడ్డి, ఎంపీపీ యర్కల సుధాకర్గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బొక్క జైపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, గడ్డం బాల్రెడ్డి, మల్లగారి శ్రీనివాస్, ఆల్వ బస్వారెడ్డి, నరేందర్ పాల్గొన్నారు.