ప్రజలు సహకరించాలి n అధికారుల విజ్ఞప్తి
గ్రామాల్లో రెండో విడుత సర్వే షురూ
వైద్య, అంగన్వాడీ సిబ్బంది వివరాల సేకరణ
దిలావర్పూర్, మే 22 : గ్రామాల్లో ఉన్న జ్వర పీడితులను గుర్తించేందుకే రెండో విడుత ఫీవర్ సర్వేను నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సంతోష్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండో విడుత సర్వేను నేటి నుంచి చేపట్టామ ని పేర్కొన్నారు. దిలావర్పూర్, న్యూ లోలంలో సర్వేను తహసీల్దార్ పర్యవేక్షించారు. ప్రజలు ఆరోగ్య పరిస్థితులను ఆశ కార్యకర్తలకు తెలియజేయాలని సూచించారు. ఎంపీడీవో మోహన్రెడ్డి, ఎంపీవో అజీజ్ఖాన్, డాక్టర్ శ్యామ్కుమార్, స్థానిక సర్పంచ్ ఓడ్నం సవిత, పంచాయతీ కార్యదర్శి దిలీప్, వైద్య బృందం సభ్యురాలు అంగురీ, ఆశ కార్యకర్త సదుముస్తు లలిత, నాయకులు ఓడ్నం కృష్ణ పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
పెంబి, మే 22 : కరోనా వైరస్ కట్టడికి నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రాజ్మోహన్ పేర్కొన్నారు. మండలంలోని ఇంటింటా తిరిగి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఆర్ఐ షేక్ హుస్సేన్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.
ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
కుభీర్, మే 22 : కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యంపై ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఫీవర్ సర్వేకు శ్రీకారం చుట్టిందని ఎంపీడీవో సుముఖం శేఖర్ పేర్కొన్నారు. మానిటరింగ్ బృం దం సభ్యులతో కలిసి ఆయన కుభీర్తో పాటు చొండి, రంజనీ గ్రామాల్లో ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. తహసీల్దార్ ప్రభాకర్, పీహెచ్సీ వైద్యుడు అవినాశ్, ఎంపీవో అసూరి గోవర్ధన్, అంగన్వాడీ టీచర్ సరిత, సత్యశీల, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
జ్వర సర్వేకు సహకరించాలి
దస్తురాబాద్, మే 22 : గ్రామాల్లో చేపట్టిన జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ గజానాన్, ఎంపీడీవో క్రాంతి కోరారు. దస్తురాబాద్లో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రెండో విడుత జ్వర సర్వేను ప్రారంభించారు. అనంతరం సర్వేను ఎర్రగుంట, మున్యాల తండా గ్రామాల్లో తహసీల్దార్, ఎంపీడీవో సర్వేను పర్యవేక్షించారు. సర్పంచ్ బిల్ సింగ్, వీఆర్వో శివకృష్ణ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు ఇందుమతి, సుధాకర్, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు సుజాత పాల్గొన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
తానూర్, మే 22 : ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని తహసీల్దార్ శ్యాంసుందర్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంతో పాటు నంద్గావ్, కోలూర్ గ్రామా ల్లో మెడికల్ ఆఫీసర్, సిబ్బంది ఫీవర్ సర్వేను నిర్వహించారు. కోలూర్లో తహసీల్దార్ శ్యాంసుందర్ ఫీవర్ సర్వేను ఆయన పరిశీలించారు. ఫీవర్ సర్వేకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఐ గంగాధర్, సీహెచ్వో మీర్ ఖసీం అలీ అబ్బాసీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
భైంసా మండలంలో..
భైంసాటౌన్, మే 22 : మహాగాం పీహెచ్సీ పరిధిలోని 30 గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించారు. ప్రజల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 13 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారిని మం దులు అందించారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మామడలో..
మామడ, మే 22 : అన్ని గ్రామాల్లో కరోనాపై రెండో విడు త ఇంటింటా సర్వే నిర్వహించారు. కరోనాపై అవగాహన కల్పించడంతో పాటు పాజిటివ్ వచ్చిన వారి వివరాలు నమో దు చేశారు. మామడలో ఎంపీడీవో రమేశ్, వైద్యురాలు మహీ త, సర్పంచ్ హన్మగౌడ్ సర్వేను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.
కుంటాలలో..
కుంటాల, మే 22 : మండలంలోని దౌనెల్లి, ఓలా గ్రామా ల్లో జ్వర సర్వే కొనసాగుతున్నది. ప్రతి ఒక్కరూ సర్వే సిబ్బందికి ఆరోగ్య వివరాలు అందజేస్తున్నారు. తమ తమ ఆరోగ్య సమస్యలు వైద్య సిబ్బందికి తెలియజేయాలని సర్పంచ్ ఎండీ హైమద్ తెలిపారు. పంచాయతీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.