అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఏపీ ఈఏపీసెట్) నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ కాకినాడ జేఎన్టీయూకు అప్పగించింది. ఈ నెల 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్ష… సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారితంగా 16 సెషన్లలో పరీక్ష నిర్వహణ ఉంటుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకు వెల్లడించారు. ఈఏపీసెట్-2021 పరీక్షకు మొత్తం 2,59,564 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 25న ఏపీఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 26 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు పక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.