అమరావతి : కడప జిల్లా కలసపాడు మండలంలోని బైరటీస్ గనిలో జరిగిన పేలుడు ఘటనాస్థలాన్ని ఆ జిల్లా ఎస్పీ అన్బురాజన్ మధ్యాహ్నం పరిశీలించారు. పేలుడు ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలను గుర్తించామని వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు.
గనిలో పేలుళ్లు జరిపేందుకు జిలెటిన్స్టిక్స్ వినియోగానికి అనుమతి ఉంది లేనిది పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఘటన దురద్రుష్టకరమని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు పోలీసుశాఖ తరఫున న్యాయం జరిగిలే చూస్తామని అన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఎస్పీ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.