అమరావతి: ప్రయాణ అప్రమత్తత (జర్నీ అలెర్ట్) కోసం సెల్ఫోన్కు పంపే ఎస్ఎంఎస్లో ఇక డ్రైవర్ ఫోన్ నంబర్ ఉండదని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీలో దూర ప్రాంత సర్వీసులకు ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకునే వారికి ఇంతకు ముందు డ్రైవర్ ఫోన్ నంబర్తో సహా మెసేజ్ వచ్చేది.
ప్రస్తుతం డ్రైవర్, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ సెంట్రల్ కంప్లైంట్ సెల్ హెల్ప్లైన్ నంబరు 08662570005 మాత్రమే ఇవ్వాలని ఆపరేషన్స్ ఈడీ అన్ని జోన్ల ఈడీలను బుధవారం ఆదేశించారు. యాజమాన్యానికి తాము చేసిన విజ్ఞప్తి ఫలించిందని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, దామోదరరావు హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.