హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ): ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదని, తాను తెలంగాణలో స్థిరపడతానని ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డి వ్యాఖ్యానించా రు. ఏపీలో పరిస్థితులు బాగాలేవని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ వద్దకు వచ్చిన జేసీ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి కలిశానని చెప్పారు. తమ మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని అన్నారు. తెలంగాణతో కలవకపోవడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందని, రాయలతెలంగాణకు ఇక్కడివారు ఒప్పుకోలేదని పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో తాను చెప్పినట్టుగానే జానారెడ్డి గెలవలేదని గుర్తుచేశారు. తాను 1980లో సమితి ప్రెసిడెంట్గా గెలిచినప్పుడు రూ.10 వేలు ఖర్చుకాగా, ఇప్పుడు ఎంపీగా నిలబడితే రూ.50 కోట్లు ఖర్చయిందని, ఒక్కొక్క ఓటుకు నాలుగైదువేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నదని వెల్లడించారు.