అమరావతి: గులాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయంలో నీరు నిలిచిపోయింది. దీంతో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం అనుకూలించక బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో సర్వీస్ గాల్లోనే చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, విమానం ల్యాండింగ్ కోసం ఎయిర్పోర్ట్ అధికారులు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.