అమరావతి,మే 26: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ విజ్ఞప్తికి స్పందించి భారతీయ నావికాదళం పలాస కోవిడ్ కేర్ సెంటర్కుఆక్సిజన్ ఆన్ వీల్స్ ప్లాంట్ను అందచేసింది. ఈ ఆక్సిజన్ ఆన్ వీల్స్కు నావికాదళానికి చెందిన నౌకా నిర్మాణ స్థలం (నావల్ డాక్యార్డ్) రూపకల్పన చేసింది. దీనిని పళాస కోవిడ్ కేర్ సెంటర్లో పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖా మంత్రి సీదిరి అప్పలరాజు సబ్ కలెక్టర్ సూరజ్ గనోర్, నావికాదళ బృంద సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు.
విశాఖపట్నానికి చెందిన నావల్ డాక్ యార్డ్ నుంచి వచ్చిన నిపుణుల బృందం పలాసలోని కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్లో ఆక్సిజన్ పైప్లైన్ తో ఆక్సిజన్ ఆన్ వీల్స్ను అనుసంధానం చేశారు. ఆసుపత్రిలో చేరిన 12మంది వరకూ రోగులకు ఇది 24 గంటలూ ఆక్సిజన్ను అందిస్తుంది. ఈ ప్లాంట్ నిర్వహణలో ఆసుపత్రి సిబ్బందికి నిపుణుల బృందం శిక్షణను ఇచ్చింది.ఆక్సిజన్ ఆన్ వీల్స్ నావల్ డాక్ యార్డ్ చేపట్టిన ప్రత్యేక చొరవ. దీనివల్ల మారుమూల ప్రాంతాలలో ఉన్న ఆసుపత్రులకు సేవలు అందించేందుకు పిఎస్ఎ ఆక్సిజన్ ప్లాంట్నుమొబైల్ ప్లాట్ఫాంతో ఏకీకృతం చేశారు.