బంజారాహిల్స్, జూలై 6: డిగ్రీ కళాశాల ఏర్పాటునకు పెట్టుబడుల పేరుతో నమ్మించి.. మోసం చేసిన విశ్రాంత అదనపు డీఐజీతో పాటు మరో వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. వరంగల్లోని విద్యానగర్ కాలనీకి చెందిన నాయని కమలాకర్ 2019లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు కోసం బంజారాహిల్స్ రోడ్ నం.1లో ఉండే సమర్ మిర్జాను కలిశాడు. దీంతో అతను విశ్రాంత అదనపు డీఐజీ మదన్లాల్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ.. అతన్ని కమలాకర్కు పరిచయం చేశాడు. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.15లక్షలు ఖర్చవుతుందంటూ చెప్పగా.. ఆ మొత్తాన్ని కమలాకర్ చెల్లించాడు.
దాంతో మదన్లాల్ రూ.1.5కోట్ల చెక్కును కమలాకర్కు ఇ చ్చి.. వారం తర్వాత బ్యాంక్లో వేసుకోవాలని సూచించాడు. ఈలోగా స్టాప్ పేమెంట్ పెట్టడంతో మదన్లాల్ వద్దకు వెళ్లిన కమలాకర్ డబ్బుల గురించి అడగ్గా.. సమర్ మిర్జాతో మాట్లాడుకోవాలంటూ సూచించాడు. సమర్ మిర్జా కోసం ఆరా తీయగా జైలుకు వెళ్లినట్లు తేలింది. దీంతో తనను మోసం చేసిన మదన్లాల్తో పాటు సమర్ మిర్జాపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.