శ్రీశైలం : కొవిడ్ నేపథ్యంలో భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా శ్రీశైల మహాక్షేత్రంలో ఆంక్షలు మరింత కఠినం చేయాలని కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు సూచించారు.
శ్రీశైలం భ్రమరాంబ సదనం సమావేశ మందిరంలో ఈఓ కేఎస్ రామారావుతోపాటు ఐటీడీఏ పీఓ రవీంద్ర రెడ్డి, ఏపీఓ మురళీధర్, సీఐ వెంకటరమణ, డిప్యూటీ తాసిల్దార్ మల్లికార్జున రావు, వైద్య అధికారి సోమశేఖర్లతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఆలయ పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భక్తుల దర్శన విధానం, వర్తక వ్యాపారాల నిర్వహణలో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఆలయ దర్శనానికి రావాలనుకునే భక్తులు విధిగా 48 గంటల ముందు పరీక్ష చేయించుకొని కొవిడ్ నెగటివ్ సర్టిఫికేట్తో రావాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.