అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూర్ ప్రభుత్వ దవాఖాన కేంద్రంగా జరుగుతున్న రెమిడెసివిర్ ఇంజెక్షన్ల అక్రమ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. దందాకు పాల్పడుతున్న పలువురు ప్రభుత్వ దవాఖాన సిబ్బందిని అరెస్టు చేసి ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఏలూర్లో కొందరు అక్రమంగా రెమిడెసివర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. 10 మంది అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో పలువురు ఏలూర్ ప్రభుత్వ దవాఖాన సిబ్బంది ఉన్నారు. స్వాధీనం చేసుకున్న ఇంజక్షన్లను ప్రభుత్వ దవాఖానకు చెందినవిగా గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.