అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో ఈ నెల 8న జరిగిన పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ కొనసాగుతున్నది. బుధవారం పేలుడు జరిగిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు.
ముగ్గు గనిలో పేలుళ్లు జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ ఏపీ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 5 ప్రభుత్వశాఖలతో ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కడప జిల్లా సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ) ఆధ్వర్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్, మైన్స్, భదరత, పేలుళ్ల నియంత్రణశాఖకు చెందిన అధికారులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
శుక్రవారం ఈ కమిటీ తన విచారణ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఇప్పటికే గనిని లీజుకు తీసుకున్న వ్యక్తి నాగేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మృతుల కుటుంబాలకు తక్షణ నష్టపరిహారం కింద ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.