Andhrapradesh-news
- Oct 25, 2020 , 19:16:10
గీతం కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి: విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేతల వ్యవహారంలో సోమవారం వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని న్యాయస్థానం పేర్కొన్నది. గీతం నిర్మాణాల కూల్చివేతపై ఆ యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ చర్యలను ఆపాలని హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ముందస్తు నోటీసు ఇవ్వకుండా యూనివర్సిటీ నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆ పిటిషన్లో తెలిపింది. క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండగా నిర్మాణాలను కూల్చివేస్తున్నారని ఆరోపించింది. నేడు దీనిపై న్యాయస్థానంలో పూర్తిస్థాయిలో విచారణ జరగనున్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ప్రియురాలిని హత్య చేసి.. గోడలో శవాన్ని దాచి
- కోవాగ్జిన్ సమర్థతపై అనుమానాలు వద్దు..
- వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్, సీరమ్ సీఈవో.. వీడియోలు
- అంతరిక్ష యాత్ర కేవలం రూ.96 లక్షలకే..
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి
- వైద్య సిబ్బంది సేవలు మరువలేం : మంత్రి సబిత
- మన భూమి కంటే పెద్ద భూమి ఇది..!
MOST READ
TRENDING