అమరావతి : తిరుమలలో భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. దాదాపు రెండు గంటలకుపైగా వర్షం పడడంతో తిరుమాడ వీధులు, రోడ్లు జలమయం అయ్యాయి. ఈదురుగాలులకు చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ వరద నీరు నిలిచింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడురోజులు రాష్ట్రంలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిన విషయం విదితమే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.