అమరావతి : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెతుత్తన్నది. దీంతో ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలోని పలు జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. బ్యారేజీలోకి ప్రస్తుతం 61,311 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు 10 గేట్లను 2 అడుగుల మేర, మరో 60 గేట్లను ఓ అడుగు మేర ఎత్తి 59,750 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గేట్లను ఎత్తినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు.