నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘కళా దర్శకుడు అవినాష్ కొల్ల నిర్దేశకత్వంలో కోల్కతాను తలపించే భారీ సెట్ను హైదరాబాద్లో వేశాం. ఆరున్నర కోట్ల బడ్జెట్తో పది ఎకరాల విస్తీర్ణంలో వేసిన ఈ సెట్లో ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. హీరో నానితో పాటు ముఖ్య తారాగణం పాల్గొనగా కీలకమైన ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నాం. నాని పాత్ర చిత్రణ, లుక్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. పూర్తి వినూత్న కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అన్నారు. జిషుసేన్గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీశర్మ, అభినమ్ గోమటం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, ఎడిటర్: నవీన్నూలి, కథ: సత్యదేవ్ జంగా, దర్శకత్వం: రాహుల్ సంకృత్యాన్.