లక్నో : కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో 10, 12వ తరగతి రాష్ట్ర బోర్డు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే 1 నుండి 12వ తరగతి వరకు పాఠశాలలను మే 15 వరకు బంద్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. కాగా పరీక్షల నిర్వహణ తాజా తేదీలను మే నెలలో ఎప్పుడైనా ప్రకటిస్తామని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
వాస్తవానికి బోర్డు పరీక్షలు మే 8వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. బోర్డు పరీక్షలు వాయిదా పడటం ఇది రెండోసారి. ఏప్రిల్ 24 నుండి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండే. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మే 8కి వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో మరోమారు పరీక్షలను నిలిపివేయాల్సి వచ్చింది.