అమరావతి : తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. సాయంత్రం హనుమంత వాహన సేవ శోభాయమానంగా సాగింది. శ్రీరాముడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి హనుమంత వాహన సేవ నిర్వహించారు. హనుమంతుడు శ్రీరామునికి సేవలందించిన తీరును ప్రస్ఫుటించేలా ఈ సేవ జరుగుతోంది.
కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పాల్గొన్నారు. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల మధ్య శ్రీరామనవమి ఆస్థానం నిర్వహించనున్నారు.
శ్రీవారి ఆలయం బంగారు వాకిలి వద్ద ఆస్థానం నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి