అహ్మదాబాద్ : కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. పలు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు దిగివస్తుండగా రికవరీ రేటు మెరుగవడం కొవిడ్-19 వ్యాప్తి అదుపులోకి వస్తోందనే సంకేతాలు పంపుతోంది. ఇక గుజరాత్ లో కరోనా రికవరీ రేటు 90.92 శాతానికి పెరిగిందని వైద్యారోగ్య వర్గాలు వెల్లడించాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3255 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మహమ్మారితో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి ఇప్పటివరకూ 7,22,741 మంది కోలుకున్నారు. అహ్మదాబాద్ లో అత్యధికంగా 512 తాజా కేసులు నమోదయ్యాయి.