సిద్దిపేట జోన్, ఏప్రిల్ 11 : చెత్తను సరైన విధంగా వేరు చేసి డిస్పోజ్ చేయకపోతే ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో వివరించి చెప్పడంతో పాటు చెత్తను ఆదాయ వనరుగా ఎలా మార్చుకోవాలో ప్రయోగాత్మకంగా ఇక్కడ స్వచ్ఛబడిలో నేర్పించడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని పాత ఎంసీహెచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వచ్ఛబడిని, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, మున్సిపల్ చైర్మన్ రాజ నర్సుతో పాటు సామాజిక కార్యకర్త డా.శాంతిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెత్తను డీకాంపోజ్ చేయ డం ద్వారా వచ్చిన వర్మీ కంపోస్టు ఎరువును వినియోగదా రునికి అందజేశారు. మిద్దెలపై కూరగాయల సాగుకు అవస రమైన దేశీయ విత్తనంతో పెరిగిన నారును మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లా డుతూ దక్షిత భారతదేశంలోనే మొట్టమొదటి స్వచ్ఛబడిని సిద్దిపేటలో ప్రారంభం చేసుకున్నామన్నారు.
సిద్దిపేటకు కొత్త ఒరవడి అందించిన డాక్టర్ శాంతి, నాయకులు, కార్యక ర్తలు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట మున్సి పల్ పరిధిలో రోజూ 40 టన్నుల చెత్త వస్తుందన్నారు. ఆలో చన చేసి వార్డుల్లో కంపోస్టు యార్డులు పెట్టి చెత్తను మూడు రకాలుగా చేసి చెత్తను వాడకం చేయవచ్చని పాఠాలు నేర్చు కుంటామన్నారు. అభివృద్ధి భవనాలు సంపద కాదని.. ప్రజల ఆరోగ్యం కాపాడటమే అన్నారు. మన పిల్లలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నారు. భవిష్యత్తులో చెత్తతో ప్ర పంచం విలవిల్లాడుతుందని మన ప్రాణాలతో పాటు ఇతర ప్రాణులను కోల్పోతున్నామన్నారు. మన పట్టణాన్ని మన ఇంటిని మనమే కాపాడుకోవాలన్నారు. గల్లీ శుభ్రంగా లేకపోతే మంచి గాలి, ఆహారాన్ని అందించలేమన్నారు. స్కూల్ పిల్లలు, డ్వాక్రా మహిళలు, నాయకులకు ఇక్కడ శిక్షణ అందిస్తామ న్నారు. బయట రసాయ నలు, ఎరువులు అధి కంగా వాడడం వల్ల ఆరో గ్యం దెబ్బతింటుంద న్నారు. చెత్తను ఎలా ఎరు వుగా మార్చుకోవాలో నేర్చు కోవాలని ప్రజలకు మంత్రి హరీశ్రావు పిలు పునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణాచారి, స్థానిక కౌన్సిలర్ దీప్తి నాగరాజు, కౌన్సిలర్లు మచ్చ వేణు గోపాల్రెడ్డి, గ్యాదరి రవీందర్, లలితా రామన్న, చిప్ప ప్రభాకర్, హరితహారం అధికారి ఐలయ్యతో పాటు పలు వురు పాల్గొన్నారు.