హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఎన్నికల కమిషనర్ పార్థసారథికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆయనను కలిసిన వారంతా అప్రమత్తమయ్యారు. ఎన్నికల కమిషనర్ పార్థసారథి గత నెలలో నిమ్స్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరంతో బాధపడుతున్న ఆయన కరోనా టెస్టులు చేయించుకోగా ఈ ఫలితం వచ్చింది. తనతో సన్నిహితంగా మెలిగిన వారంతో కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు పార్థసారథి. గురువారం కరోనా పరీక్షలు నిర్వహించగా, శుక్రవారం ఫలితాలు వచ్చాయి.