హిందువు మృతదేహానికి అంత్యక్రియలు
నర్సాపూర్, మే 17: కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు సొంతవారే ముందుకురాని స్థితిలో పలువురు ముస్లిం యువకులు అన్నీ తామై అంతిమ సంస్కారం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామంలో సోమవారం ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందాడు. అతనికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకురాలేదు. విషయం తెలుసుకొన్న నర్సాపూర్ పట్టణానికి చెందిన జబ్బార్ఖాన్, షాదుల్లా, జలీల్, అజీజ్, షారూఖ్ అనే యువకులు హిందూ సంప్రదాయం ప్రకారం అతని అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వం చాటుకొన్న యువకులను పలువురు అభినందించారు.