తిరుమల : తిరుమలలో శుక్రవారం గరుడ పంచమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామి తనకు ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ గరుడ వాహనసేవ జరిగింది. శ్రీవారి వాహనాల్లో, సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడుడు. గరుడ వాహనసేవలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు.