తిరుమల : తిరుమలలో శుక్రవారం గరుడ పంచమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీమలయప్పస్వామివారిని తనకు ఇష్టవాహనమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగించనున్నారు. ప్రతి ఏడాదీ తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలా బలంగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ‘గరుడపంచమి’ పూజ చేస్తారు.