భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి భక్తులు గోటి తలంబ్రాలను సమర్పించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణచైతన్య సంఘం సభ్యుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో భక్త బృందం గోటితో ఒలిచిన రెండున్నర క్వింటాళ్ల తలంబ్రాలను ఆదివారం ఆలయ ఈవో బానోత్ శివాజీకి అందజేశారు. – భద్రాచలం