అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఆటో నుంచి పడి నలుగురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారంతా సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువులో జరుగుతున్న వివాహ వేడుకకు హజరవడానికి వెళ్తున్నారని, ఈ క్రమంలో బుధవారం ఉదయం కలుజువ్వలపాడు వద్ద ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారిపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.