చెన్నై : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు శుక్రవారం 15 కేజీల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న టాంజానియాకు చెందిన ఓ వ్యక్తిని, మహిళను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న హెరాయిన్ విలువ రూ.100 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ ఉన్నతాధికారులు తెలిపారు.
ఆఫ్రికా నుంచి భారత్కు డ్రగ్స్ రవాణా జరుగుతుందని కస్టమ్స్ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు నిఘా పెట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్న టాంజానియాకు చెందిన 43 ఏండ్ల మహిళను, 45 ఏండ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కస్టమ్స్ కమిషనర్ రాజన్ చౌదరి తెలిపారు.
హెరాయిన్ను పాలిథిన్ సంచుల్లో కట్టి వాసనను రాకుండా ఇందులో మసాలా పొడిని చల్లినట్లు ఆయన చెప్పారు. తనతోపాటు తన సహాయకుడు వైద్యం కోసం బెంగళూర్ వెళ్తున్నట్లు చెప్పి మహిళ వీసా పొందిందని అధికారులు విచారణలో గుర్తించారు. బెంగళూర్కు నేరుగా విమానం లేకపోవడంతో చెన్నైలో దిగి పట్టుబడినట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.