అమరావతి : కర్నూల్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కొవిడ్తో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అందక నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలో కేఎస్ కేర్ దవాఖానలో ఈ ఘటన జరిగింది.
ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై వెంటనే విచారణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.
కొన్ని దవాఖానలు అనుమతి లేకుండానే కరోనా చికిత్స చేస్తున్నాయని, ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు.
నలుగురు ఆక్సిజన్ అందకే చనిపోయారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.