శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీరు నిలకడగా వస్తుంది. శనివారం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 22,086 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 70,506 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. కాగా సాయంత్రానికి జలాశయానికి 87,852 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా నమోదయింది.
అదే విధంగా ఏపీ పవర్హౌస్లో 9,574 క్యూసెక్కులు, టీఎస్ పవర్హౌస్లో 31,784 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుని దిగువన ఉన్న నాగార్జున సాగర్కు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా, ప్రస్తుతం 879.50 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 185.56 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.