విశాఖ : విశాఖ ఏజెన్సీ బుధవారం మధ్యాహ్నం ఉలిక్కిపడింది. 25 నిమిషాల పాటు ఫైరింగ్ కొనసాగింది. కాల్పుల మోతతో విశాఖ మన్యం దద్దరిల్లిపోయింది. గూడెం కొత్తవీధి మండల పరిధిలోని పెబ్బంపల్లి అటవీ ప్రాంతంలో గ్రే హౌండ్స్ దళాలు ఇవాళ ఉదయం నుంచి కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.
ఈ క్రమంలో మావోయిస్టులు తారపడటంతో కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల మధ్య 25 నిమిషాల పాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ నెల 28 నుంచి ఆగస్టు మొదటి వారం వరకు అమరవీరుల వారోత్సవాలను మావోయిస్టులు నిర్వహిస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల ఏరివేతకు బలగాలు కూంబింగ్ చేపట్టాయి.