అమరావతి : చిత్తూర్ జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని శేషాచలం అటవీప్రాంతంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. అటవీప్రాంతంలో పశువులు కాసేందుకు వెళ్లిన కొందరు నిప్పుపెట్టడంతో మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే కొటాల, పులిత్తివారిపల్లి సమీప అటవీ ప్రాంతానికి మంటలు వ్యాపించాయి. స్థానికుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మంటల ధాటికి వందల ఎకరాల విస్తీర్ణంలో అటవికి నష్టం వాటిల్లినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.