అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ సమావేశం మందిరంలో శుక్రవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో సమావేశ మందిరంలోని ఫర్నిచర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిబూడిదయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.