అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్ మీనాకు.. పరిశ్రమల శాఖ (ఫుడ్ ప్రాసెసింగ్) కార్యదర్శిగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. రవిశంకర్ నారాయణ్కు స్టేట్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్తోపాటు డ్రగ్ కంట్రోల్, కాపీరైట్స్ అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర పన్నుల విభాగం చీఫ్ కమిషనర్గా ఉన్న పీయూష్ కుమార్ను సాధారణ పరిసాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సీసీఎస్ఏ అప్పీల్స్ కమిషనర్గా లక్ష్మీనరసింహానికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. హరిజవహర్లాల్కు సీసీఎల్ఏ అదనపు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయించింది.