Andhrapradesh-news
- Jan 24, 2021 , 13:09:56
VIDEOS
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి

అమరావతి : రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృత్యువాతపడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం ఓంపల్లి చెరువు వద్ద చోటు చేసుకుంది. మృతులను ఉల్లూరు మండలం చిన్ననాగారెడ్డిపల్లికి చెందిన రామిరెడ్డి, ఉమేశ్గా గుర్తించారు. రామిరెడ్డి భార్యతో పాటు ఇద్దరు కుమారులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓంపల్లి చెరువు వద్ద ముందు వెళ్తున్న లారీని ఓవర్ టెక్ చేయబోసి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ఘటనలో రామిరెడ్డి, ఉమేశ్ మృత్యువాత పడగా.. భార్య, మరో కొడుకు గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్కు ఇన్నోవేషన్ ఎక్స్ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ
- మనకు కావాల్సింది నిమిషాల్లో తెచ్చిస్తారు
- మరణించీ.. మరొకరికి బతుకునిద్దాం
- అందుబాటులోకి కొవిన్ యాప్ కొత్త వర్షన్
- చిన్నారులను రక్షించిన కాచిగూడ పోలీసులు
- అరుదైన మండలి ఎన్నిక నిర్వహణ..! దినపత్రికంత బ్యాలెట్
- మొండి బకాయిలపై లోక్ అదాలత్
MOST READ
TRENDING