టోల్ ఫ్రీ, కాల్ సెంటర్ల ఏర్పాటు
ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎం డేవిడ్
ఎదులాపురం, ఏప్రిల్ 20 : కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఏవైనా సమస్యలుంటే కాల్సెంటర్లకు తెలియజేయవచ్చని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎం డేవిడ్ అన్నారు. తద్వారా జిల్లా యంత్రాంగం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరోగ్యం, మున్సిపల్, రవాణా, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1939, పోలీస్ శాఖలో కాల్ సెంటర్ 94407 95079, వైద్య ఆరోగ్య శాఖలో కాల్ సెంటర్ 73827 25029కు సమస్యలు తెలియజేయవచ్చని తెలిపారు. ఈ విపత్కర సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్లను సిద్ధంగా ఉంచాలని, పీపీఈ కిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా జాగ్రత్తలు, వ్యాక్సినేషన్పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని పంచాయతీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం అదనపు ఎస్పీ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు కరోనా వ్యాక్సిన్పై ఉన్న అపోహలను నివృత్తి చేయాలని వైద్యాధికారులను కోరారు. ఆ తర్వాత ఆర్డీవో జాడి రాజేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే, అదనపు డీఎంహెచ్వో శ్రీకాంత్, తహసీల్దార్ వనజారెడ్డి, డీటీ ప్రవీణ్ కుమార్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సీవీఎన్ రాజు, నోడల్ అధికారి అశోక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.