విశాఖపట్నం : కొవిడ్-19 సెకండ్ వేవ్ అదేవిధంగా ప్రయాణికుల కొరత కారణంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైళ్ల రద్దు పొడిగించేందుకు నిర్ణయించింది. జూన్ 11 నుండి 21వ తేదీ వరకు రైళ్ల రద్దు ప్రక్రియ కొనసాగనుంది. దీని ప్రకారం.. ఇరువైపుల నడిచే రోజువారీ ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం-రాయపూర్- విశాఖపట్నం, భువనేశ్వర్-జగదల్పూర్-భువనేశ్వర్, విశాఖపట్నం-కిరాండుల్-విశాఖపట్నం, విశాఖపట్నం-కాచిగుడ-విశాఖపట్నం, విశాఖపట్నం-కడప-విశాఖపట్నం, విశాఖపట్నం- లింగంపల్లి-విశాఖపట్నం ప్రత్యేక రైళ్ల రద్దు కొనసాగనుంది. అదేవిధంగా సంబల్పూర్-రాయగడ-సంబల్పూర్ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా జూన్ 12 నుండి 20వ తేదీ వరకు రద్దు అయ్యాయి.