అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. వరికుంటపాడు మండలంలో భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మండలంలోని కనియంపాడు, బోయమడుగుల, జంగంరెడ్డిపల్లిలో 3 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తినష్టం సంభవించ లేదు. విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆయా గ్రామాలవాసులు ఆందోళనకు లోనవుతున్నారు. ఇండ్లలో ఉండేందుకు జంకుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.