కొమురంభీం ఆసిఫాబాద్ : తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కొమురంభీం ఆసఫిబాద్ జిల్లా వాంకిడి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలోని మావోయిస్టు బాధిత కుగ్రామమైన కోలంగుడ నివాసితుల కోసం వాంకిడి పోలీసులు శుక్రవారం ఒక బోర్వెల్ను స్పాన్సర్ చేశారు. పోలీసులు 20 రోజుల క్రితం ఈ గిరిజన గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు నీటి ఎద్దడి సమస్యను గుర్తించారు.
కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా గిరిజనుల సమస్యను పరిష్కరించేందుకు తాము ముందుకు వచ్చినట్లు వాంకిడి ఇన్స్పెక్టర్ సుధాకర్, సబ్ ఇన్స్పెక్టర్ డి. రమేష్ తెలిపారు. నిషేధిత మావోయిస్టులకు సహకారం అందించవద్దని ఆయన ఈ సందర్బంగా గిరిజనులను అభ్యర్థించారు. కాలం చెల్లిన భావంజాలంతో మావోయిస్టులు ఏమీ సాధించలేరని పేర్కొన్నారు.
సంబంధిత అధికారుల సహాయంతో ఈ కుగ్రామానికి త్వరలోనే రహదారి, విద్యుత్తును అందిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. 11 కుటుంబాల జనాభా కలిగిన ఈ కుగ్రామ నివాసులు తమ దాహార్తి తీరేందుకు కిలోమీటరు దూరంలో ఉన్న ఒక ప్రవాహంపై ఆధారపడవలసి వచ్చేది. బోర్వెల్ను బహుమతిగా అందించిన పోలీసులకు నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు.