అమరావతి : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని డీఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జీ సతీష్రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఈ ఉదయం ఆలయానికి చేరుకున్నారు. వేదపండితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు సతీష్రెడ్డికి అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని బహూకరించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి దంపతులు సైతం ఇవాళ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.